గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మొక్కను నాటిన ప్రకాశ్ అంబేద్కర్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం హైదరాబాద్లోని బేగంపేటలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త , రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్(బీసీ సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి మొక్కనునాటారు.ఈ సందర్భంగా ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ ‘తనను కలవాలనుకునే వారు తప్పనిసరిగా మొక్కలు నాటాలని చెప్పిన మా తాత బీఆర్.అంబేద్కర్’ స్పూర్తిని కొనసాగిస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆశయం గొప్పదన్నారు ‘ మనుషుల్లో సమానత్వం, ప్రకృతి సమతూల్యత’ కోసం పరితపించిన అంబేద్కర్జయంతి రోజున మొక్కను నాటడం సంతోషంగా ఉందన్నారు. ‘ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటిన తర్వాతే తనను కలిసేందుకు రావాలని కోరుకున్నారు. మొక్కలు నాటడం పట్ల వారికి అమితమైన ఆసక్తి ఉండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ స్ఫూర్తిని ‘ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో చూస్తున్నానని’ ఆయన పేర్కొన్నారు.మంచి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కృషి అనితరసాధ్యమైనది.‘ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ’ లిమ్కాబుక్ లో చేరడం ఆనందం కలిగించింది. వారి కృషికి మరింత గుర్తింపు రావాలి. ప్రకృతి పచ్చదనంతో పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని’ ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సంజీవ రాఘవ తదితరులు పాల్గొన్నారు.