తెలంగాణాలో కొత్త సంక్షేమ పథకం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఇప్పటికే ఎన్నో ప్రతిష్ఠాత్మక పథకాలను అమలు చేస్తోంది. అటు సంకేమంతో పాటు ఆయ రంగాల అభివృద్ధికి దోహదపడేలా రకరకాల పథకాలను అమలు చేస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కాగా.. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మరో సరికొత్త పథకాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే.. రాష్ట్రంలో ఇప్పటికే గొల్ల, కురుమలను ఆదుకునేందుకు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు.. సర్కారు ఉచితంగా గొర్రెలను పంపిణీ చేస్తోంది. అయితే.. అప్పుడప్పుడు ఈ మూగజీవాలు ప్రమాదాల్లో చనిపోవటంతో యజమానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అలాంటి సమయాల్లో.. ఆ జీవాల పెపంకం దారులను ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు.. కొత్త పథకాన్ని తీసుకురానున్నట్టు సమాచారం. ఆ పథకానికి.. ‘కేసీఆర్ జీవ బంధు’ అనే పేరుతో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

వాళ్లకు మాత్రమే వర్తిస్తుందటా…

అయితే.. ఈ పథకాన్ని జీవాల పెంపకందారుల సొసైటీల్లో సభ్యత్వం ఉన్న వారికే వర్తింపజేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాదవ, కురుమ సొసైటీల్లో 6 లక్షల 60 వేలకు పైగా సభ్యులున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 2 కోట్లకు పైగా గొర్రెలు, 50 లక్షలకు పైగా మేకలు ఉండగా… పెంపకందారుల సంఖ్య 7,61,895గా ఉంది. అయితే.. ఈ జీవ బంధు పథకం అమలు కోసం సర్కారు.. గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి కార్పోరేషన్‌‌కు కార్పస్‌ ఫండ్‌ కింద రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు డిపాజిట్ చేయనుంది. దీని ద్వారా సంవత్సరానికి 25 లక్షల నుంచి 50 లక్షల వరకు వచ్చే వడ్డీని.. ఈ పథకానికి వాడుకోనున్నారు.

Leave A Reply

Your email address will not be published.