పోలీసుల తనిఖీల్లో భాగంగా భారీగా నగదు పట్టివేత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నగరంలోని ఎల్బీనగర్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పోలీసులు భారీగా నగదు పట్టుబడింది. కరెన్సీ నోట్లను ఎక్స్చేంజ్ చేస్తామని నలుగురు వ్యక్తులు రూ.కోటి 90 లక్షల మేర మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.