ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆరెస్ పార్టీని గెలిపించాలని చెప్పడం బాధాకరం

.. సీనియర్ వైస్ ప్రెసిడెంట్. నిరంజన్

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆరెస్ పార్టీని గెలిపించాలని చెప్పడం బాధాకరమని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. గాంధీభవన్ లో ఆయన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆరెస్ పార్టీని గెలిపించాలని చెప్పడం బాధాకరమని, గుత్తా రాజ్యాంగ పరమైన పదవిలో వున్న విషయం మర్చిపోయారా? గుత్తా సుఖేందర్ ప్రచారం చేయాలంటే ముందు ఛైర్మెన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభ, రాజ్య సభ ఛైర్మెన్ పదవులు, శాసన సభ స్పీకర్ పదవులు, గవర్నర్ పదవులు రాజ్యాంగ పరమైన పదవులు పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేసిన తర్వాత ఈ పదవులను చేపడ్తారని, అలాంటి రాజ్యాంగ పదవుల్లో కూర్చొని ఒక పార్టీకి కొమ్ముకాయడం ఏమిటని ప్రశ్నిచారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్ర పతిగా ఎంపికయ్యే ముందు పార్టీకి రాజీనామా చేశానన్నారు. రాష్ట్రంలో టీఆరెస్, బిజెపి పాలన వచ్చాక రాజ్యాంగ పదవులకు విలువలేకుండా పోయిందని, పోచారం, గుత్తా రాజ్యాంగ పదవుల్లో వుంటూటీఆరెస్ కు కొమ్ముకాస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పదవుల విలువలు కాపాడాలని కోరుకుంటున్నామని, వెంటనే గుత్తా రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.