మీ స్మార్ట్‌ఫోన్ సడెన్‌గా నీళ్లలో పడిందా.. వెంటనే ఇలా చేయండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ స్మార్ట్‌ఫోన్ భాగమైపోయింది. ఈ ఫోన్ లేకుండా ఎవ్వరూ ఉండలేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా మనలో చాలా మంది ఫోన్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోవడం లేదా వర్షంలో తడిచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో తమ ఫోన్‌ను వెంటనే ఆరబెట్టే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఇలా ఫోన్ నీళ్లలో పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.. ఇలా చేయడం వల్ల మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

ఫోన్ నీళ్లలో పడితే ఏం చేయాలి..
మీ స్మార్ట్‌ఫోన్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయినా లేదా వర్షానికి తడిచినా ముందుగా మీ డివైజ్‌ను ఆఫ్ చేయండి. ఫోన్ లోపలికి నీరు చేరిన తర్వాత ఫోన్‌ను ఆన్‌లో ఉంచితే మరింత నష్టం జరగొచ్చు. అలాగే మీ ఫోన్ నీటిలో పడినప్పుడు, ఆ నీటిని బయటికి పంపేందుకు దాన్ని ఎక్కువగా షేక్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఫోన్ లోపలి భాగాల్లోకి నీరు చేరే ప్రమాదం ఉంది.

ఈ పొరపాట్లు చేయకండి..
మరికొందరు ఫోన్‌ లోపల నీరు ఆరిపోవాలని హెయిర్ డ్రయ్యర్‌ను వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువగా నీరు చేరే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకే చోట వేడెక్కి మిగతా భాగాలను దెబ్బతీస్తాయి.

మీ ఫోన్ సడెన్‌గా నీళ్లలో పడితే ముందుగా పొడి బట్టతో ఫోన్‌ను తుడవాలి. అనంతరం చాలా సమయం వరకు(సుమారు 12 గంటల పాటు) స్మార్ట్‌ఫోన్‌ను వాడకూడదు. అలాగే కనీసం ఆరు గంటల పాటు బియ్యం బ్యాగులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ వేగంగా డ్రై అవుతుంది. అయితే బియ్యం గింజలు హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ పోర్టులో వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. మీ ఫోన్లో ఉండే సిమ్ కార్డు ట్రేలను తీసేయాలి. ఫోన్ పూర్తిగా ఆరిపోయిన తర్వాతే దాన్ని మళ్లీ ఆన్ చేయండి. ఫోన్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత కూడా ఫోన్ లోపల కొంత తేమ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ మునుపటిలా సరిగా పని చేయకపోతే, స్మార్ట్‌ఫోన్ సర్వీసు సెంటర్లో చూపించాలి.

Leave A Reply

Your email address will not be published.