సీఎం జగన్ కు  సుప్రీంకోర్టులో షాక్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం జగన్ కు  సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. గ్రామ వలంటీర్ల చేత సాక్షి దినపత్రిక కొనుగోలు చేయడంపై దాఖలైన పిటిషన్ విచారణను ఢిల్లీ హైకోర్టుకు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం బదిలీ చేసింది. వలంటీర్లకు నెల నెలా రూ.200 మంజూరు చేసి.. సాక్షి దినపత్రిక కొనుగోలు చేయించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు లో ఉషోదయా సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ పలు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. న్యాయ, పరిపాలన ప్రయోజనాల దృష్ట్యా విచారణను ఏపీ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తున్నామని చంద్రచూడ్ తెలిపారు. ఢిల్లీ హైకోర్టు కు విచారణను బదిలీ చేయడం వల్ల ఏపీ హైకోర్టుపై నమ్మకం పోతుందని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.అలాంటి అభిప్రాయానికి తావు ఇవ్వకుండా ఉత్తర్వులు ఇస్తామమని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇది 2 పేపర్ల మధ్య వ్యవహారంగా కనిపించడంలేదని, రెండు పార్టీల మధ్య వ్యవహారంగా కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజాధనం వలంటీర్లకు బదిలీ చేసి సాక్షి పత్రికను కొనుగోలు చేయించడాన్ని గతంలో ఉషోదయా సంస్థ హైకోర్టులో సవాల్ చేసింది. ఇదే అంశంపై గతంలో దాఖలైన పిల్కు ట్యాగ్ చేయాలని, ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం పిటిషన్పై ఉషోదయా సంస్థ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్డు సీజేఐ ధర్మాసనం.. చివరికి విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ పెంచుకునేందుకు వైసీపీ సర్కారు మరో ఎత్తుగడ వేసింది. విస్తృత సర్క్యులేషన్ ఉండి, ప్రభుత్వ పథకాల సమాచారం ఇచ్చే సాక్షి న్యూస్ పేపర్ కొనాలని వలంటీర్లకు పరోక్షంగా జీవో జారీ చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల 60 వేల మంది వలంటీర్లు ఉన్నారు. పేపర్ కొనేందుకు ఒక్కో వలంటీరుకు రూ. 200 మంజూరు చేశారు. అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పేరుతో వలంటీర్ల పేస్లిప్‌లో రూ. 5 వేలకు అదనంగా ఈ రూ.200 అలాట్ చేశారు. ఏజెంట్ ఇచ్చిన పేపరు బిల్లును యాప్‌లో అప్లోడ్ చేయాలని వలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఏజెంట్లు వలంటీర్ల ఇళ్లకు దినపత్రికను చేరవేస్తున్నారు. తమను అడక్కుండా దినపత్రిక ఎలా వేస్తారని కొందరు వలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.