బిసి ల అభ్యున్నతికి ‘ఆదర్శ కిరణం’ పత్రిక కృషి అభినందనీయం

- కిషన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిసి ల అభ్యున్నతికి ‘ఆదర్శ కిరణం’ మాస పత్రికను చేస్తున్న కృషి అభినందనీయమని  కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఆదర్శకిరణ మాసపత్రిక ప్రధాన సంపాదకులు వంగాల బాలరాజ్ గౌడ్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని బిజెపి నగర్ ఆఫీసు మంత్రి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా  కలిసారు. ఈ సందర్బంగా బీసీల మాస పత్రిక ఆదర్శ కిరణం బీసీల కోసం చేస్తున్న కృషిని అభినందించారు. మంత్రిని కలిసిన వారిలో పత్రిక ప్రధాన సంపాదకులు వంగాల  బాలరాజు గౌడ్,బిజెపి కార్పొరేట్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.