టీటీడీ వీఐపీ దర్శనాన్ని రద్దు చేయాలి

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  సామాన్య భక్తులను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వి ఐ పి దర్శనాన్ని రద్దుచేయాలని శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధన కార్య దర్శి ఏ సుదర్శన్ డిమాండ్ చేసారు.ఈ మారాకు మంగళవారం కాచి గూడా రైల్వే స్టేషన్ ఎదుట నిరసన ర్యాలి జరిపారు.ఈ సందర్బంగా  సుదర్శన్ మాట్లాడుతూ టీటీడీ సామాన్య భక్తులను ఇబ్బంది పాలు గురిచేస్తుందని, ఒకరోజు 40 గంటలు ఒకరోజు 30 గంటలు ఒక రోజు 20 గంటలు ఈ విధంగా  సామాన్య  భక్తులను ఇబ్బంది పాలు చేస్తున్నారని,  టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి  సొంత నిర్ణయాలు తీసుకుంటూ సామాన్య భక్తులకు నరకం చూపిస్తున్నారని ఆయన విమర్శించారు.సామాన్య  భక్తులైన కోటీశ్వరులు భక్తులైన అందరికీ ఒకటే విధానం ఉండాలి వి ఐ పి దర్శనం రద్దు చేయాలి మరియు ఎవరైనా సరే స్వామి దర్శనం చేసుకోవాలి అంటే అన్న ప్రసాదం ఖచ్చితంగా  తీసుకోవాలి అప్పుడే  స్వామివారి దర్శనం ఇవ్వాలి ఈ విధంగా చేస్తే సామాన్యులకు ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లోగణేష్ యువసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ వికాస్ రాజు విశాల్ మనోజ్ దినేష్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.