సీఎం కేసీఆర్ పై మండిపడ్డ షర్మిల
తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ :
తెలంగాణ సీఎం కేసీఆర్ పై వై.ఎస్ షర్మిల మరోసారి మండపడ్డారు. పిట్లం అంబేద్కర్ చౌరస్తా వద్ద సభలో ఆమె ప్రసంగించారు. కేసీఆర్ హయాంలో పెన్షన్లు లేవు, కార్పొరేషన్లకు నిధులు లేవు, దళితులకు మూడెకరాల భూమిలేదని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్ పాలన సాగిందన్నారు. వైఎస్.. ప్రజాదర్బార్ లో వందల మంది కష్టాలు తీర్చారన్నారు. ఇప్పుడున్న నాయకుల్లో ఏ ఒక్కరైనా అలా ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు.