ప్రజలు ఆశించిన తెలంగాణ ఇదేనా?

- సీఎం కేసీఆర్‌ కు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం కేసీఆర్‌ కు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. ప్రజలు ఆశించిన తెలంగాణ ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. 54 శాతం బీసీ లకు నిధులెన్ని కేటాయించారని లేఖలో పేర్కొన్నారు. దళిత బందులాగే బీసీ బంధు పెట్టాలని డిమాండ్ చేశారు. 54 శాతం జనాభా ఉంటే బడ్జెట్లో 5 శాతం నిధులు కేటాయిస్తారా?, కనీసం కేటాయించిన నిధులు అయినా ఖర్చు చేశారా? అని లేఖ ద్వారా ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వివాదం తనకు తెలియదన్నారు. నిరుద్యోగుల సమస్య మీద కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.