వర్షంలోనూ కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్/ కామరెడ్డి: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్ర కామారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలంలో పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో జోరుగా వర్షం పడుతున్నప్పటికీ పాదయాత్రని యధావిధిగా కొనసాగించారు. పాదయాత్రలో భాగంగా కర్షకులను, వ్యవసాయ కూలీలను పలకరిస్తూ పాదయాత్రను కొనసాగించారు. ఆమె వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.