ఉగ్రదాడిపై ఆవేదన వ్యక్తం చిసిన రాజ్‌నాథ్, అమిత్ షా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్కేంద్ర హోమంత్రి అమిత్ షా చేశారు. జమ్ముకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో జరిగిన విషాదం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఆర్మీ ట్రక్కుకు మంటలు అంటుకున్న ఈ ఘటనలో ఇండియన్ ఆర్మీ ధైర్యశాలి సైనికులను కోల్పోయింది. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాజాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గతవారమే అక్కడి భద్రతపై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా మే నెలలో జమ్ముకాశ్మీర్ వేదికగా జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆందోళనలు రేకెత్తించేందుకు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.