త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. ఉపాధ్యాయులుజూనియర్ లెక్చరర్స్ బదిలీలపై సమీక్షించామని.. త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలలో ఉన్న చట్టాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే అంశంపై పరిశీలిస్తున్నామన్నారు. సీఎం జగన్ దీని పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. విద్యార్థులుకు రాగి జావా నిలిపివేశామంటూ వస్తున్న ప్రచారం తప్పు అని.. తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పుకొచ్చారు. పరీక్షలుఒంటి పూట బడుల వలన ప్రస్తుతానికి రాగిజావాకు బదులు చిక్కీలు ఇస్తున్నామని మంత్ర బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.