మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ప్రేవేటుపరం చేయొద్దు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ప్రేవేటుపరం చేయొద్దని కేంద్రరక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటుపరం చేయొద్దన్నారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుందని తెలిపారు. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుందనిఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకిసిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావాల్సినంత పని ఉండేదని,దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదని.. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని “సిక్ ఇండస్ట్రీ”గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సుమారు 25వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుందని తెలిపారు. అలాగే ఆయుధ కర్మాగార తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు ఇచ్చిన ఆరు డిమాండ్లను లేఖకు జత చేశారు.

ఆరు డిమాండ్లు ఇవే…

1. మూడు రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

2. పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి.

3. మిషనరీని ఆధునికరించాలి. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి.

4. పరిపాలనకొనుగోలు విధానాలను సరళీకరించాలి.

5. ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలి.

6. ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలి.

Leave A Reply

Your email address will not be published.