ఈనెల 25న భారాస కార్వాన్ నియోజకవర్గ ప్రతినిధుల సదస్సు
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: కార్వాన్ నియోజకవర్గ ప్రతినిధుల సదస్సును ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కార్వాన్ నియోజకవర్గ ఇన్చార్జి కాహర్ జీవన్సింగ్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు లంగర్హౌజ్ లోని డి-ఫోర్ట్ ఫంక్షన్ హాల్ వేదికగా ఈ సదస్సు ప్రారంభమై సాయంత్రం వరకూ కొనసాగుతుందన్నారు. ఈ మేరకు ఆదివారం ఠాహర్ జీవన్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో భారాస మాజీ కార్పొరేటర్లు, బారాస డివిజన్ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్రియాశీలక సభ్యులు, ముఖ్యనేతలు హజరై సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బారాస పార్టీని అట్టడుగుస్థాయి వరకూ తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సన్నాహక సమావేశంలో భారాస మాజీ కార్పొరేటర్లు మిత్రకృష్ణ, బంగార ప్రకాశ్, డివిజన్ అధ్యక్షులు చంద్రకాంత్, సబూరి రఘు, బంటి యాదవ్, వారాస నేతలు కృష్ణదాస్, జగదీశ్ యాదవ్, దుర్గారాజ్, డివిజన్ అధ్యక్షులు, ప్రధానకార్యదర్శులతో పాటు క్రియాశీలక సభ్యులు తదితరులు పాల్గొన్నారు