బాన్సువాడలో నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని (ఎప్రిల్27) పురస్కరించుకుని మంగళవారం బాన్సువాడ పట్టణ సమీపంలోని SMB ఫంక్షన్ హాల్ లో బాన్సువాడ నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది. ముందుగా వేదిక వద్ద గులాబీ జెండాను డిసిసిబి ఛైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆవిష్కరించగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి  తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన ప్లీనరి సమావేశం ప్రారంభమైంది . ఈ ప్లీనరీకి బాన్సువాడ నియోజకవర్గ BRS పార్టీ నాయకులు, DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, BRS పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డి. అంజిరెడ్డి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల లోని గ్రామాల నుండి, బాన్సువాడ మున్సిపాలిటీ పరిధి నుండి పెద్ద ఎత్తున BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.