జోడో యాత్ర ఏర్పాట్లు పర్యవేక్షించిన ఠాగూర్
తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: భారత్ జోడో యాత్ర సందర్భంగామహబూబ్ నగర్ జిల్లాలో ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్ బుధవారం రూట్ పర్యవేక్షణ చేసారు. జోడో యాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఠాగూర్ వెంట సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్, బోసురాజు తదితరులు ఉన్నారు.