తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం

-   బీసీ విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజాగొంతుక తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు బీసీ విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం  మల్లన్న ఇంటి వద్ద ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా  మోదీరాందేవ్ మాట్లాడుతూ ‘క్యు న్యూస్’ ద్వారా అనేక విషయాలు వెలుగులోకి చేస్తూ జనాలను సంఘటితం చేస్తున్న తీన్మార్ మల్లన్న పై కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. దీనిని బీసీ విద్యార్థి సంఘం ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రశ్నించడం ఆఫ్టనిస్తాను కన్నా అధ్వానంగా మారిందన్నారు.  బహుజనవాదం ముందుకు పోవాలంటే పేద ప్రజలకు న్యాయం జరగాలంటే మల్లన్న పార్టీ పెట్టడం శుభ పరిణామమన్నారు.ఈ కార్యక్రమం లో బీసీ స్టూడెంట్ వింగ్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మణికంఠ గౌడ్, బిజెపి మేడ్చల్ కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.