బీఆర్ఎస్ – బీజేపీ మధ్య ఉన్న అండర్ స్టాండ్ ఏంటీ?..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: లౌకిక వాదానికి భిన్నంగా కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యాలపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ – బీజేపీ మధ్య ఉన్న అండర్ స్టాండ్ ఏంటీ?.. అలాగే ఎంఐఎం బీఆర్ఎస్.. ఈ రెండు పార్టీలకు బీజేపీతో ఉన్న అవగాహన ఏంటని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ లకు భారత రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించిందని, ఇప్పుడు వాళ్లు రిజర్వేషన్లు కల్పించేది ఏమిటని మండిపడ్డారు.కొత్త రాష్ట్రమని రెండోసారి కేసీఆర్‌ కు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని, నిధులు నియామకాలు లేకుండా దోపిడీ చేశారని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పిందని.. 9 ఏళ్ళలో 18 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలన్నారు. ప్రభుత్వాలు చెప్పిన మాటలు చేతల్లో లేవని భట్టి విక్రమార్క అన్నారు.

Leave A Reply

Your email address will not be published.