టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి రజినీకాంత్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి రజినీకాంత్ వెళ్లారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులకు చంద్రబాబు తేనీటి విందు ఇచ్చారు. ఈ ఏడాది ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా ఓ సావనీర్‌ను తీసుకురానున్నారు. ఈ మేరకు టీడీ జనార్ధన్‌ నేతృత్వంలో సావనీర్‌ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో సావనీర్‌ను తీసుకురావడంతో పాటు ఎన్టీఆర్‌ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా ఓ వెబ్‌సైట్‌ను, యాప్‌ను కూడా తీసుకురానున్నారు. సావనీర్‌, వెబ్‌సైట్‌, యాప్‌ ఆవిష్కరణ కార్యక్రమాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. అదే సమయంలో ఎన్టీఆర్‌ ప్రసంగాలతో రెండు పుస్తకాలను కూడా తీసుకురానున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌పై తొలి పుస్తకం రాసిన సీనియర్‌ జర్నలిస్టు ఎస్‌.వెంకటనారాయణ కూడా పాల్గొననున్నారు. ఎన్టీఆర్‌ ఔన్నత్యాన్ని భవిష్యత్‌ తరాలకు తెలియజేయడమే లక్ష్యంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సావనీర్‌ కమిటీ చైర్మన్‌ టీడీ జనార్ధన్‌ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.