క్షయ వ్యాధి రోగులు కు టిబి కిట్స్ పంపిణీ చేసిన రిటైర్డ్ కలెక్టర్ అజయ్ మిశ్రా

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా టిబి కన్వీనర్ డా విజయ్ భాస్కర్ గౌడ్ అధ్వర్యంలో రెడ్ క్రాస్ హైదరాబాద్ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి సమక్షంలో లో గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ సహాయం తో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్, స్టేట్ చైర్మన్ అజయ్ మిశ్రా రిటైర్డ్ కలెక్టర్ మరియు అసిప్ నగర్ తహసీల్దార్ శ్రీమతి ఫరీన్ చేతుల మీదుగా క్షయ వ్యాధి రోగులు కు టిబి కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మరింత మంది దాతలు ముందుకు వచ్చి క్షయ వ్యాధి రోగులు ను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్టేట్ వైస్ చైర్మన్ విజయ్ కుమారి, యం సి సభ్యులు వినయ్ కిశోర్, అనురాధ, మహ్మద్. రియాజుద్దీన్, ఎ. వి రావు, జై. ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, సుప్రభా,ఆయూభ్ ఖాన్,   ధర్మ తేజ, రూపా దేవి, వెంకట్, మహేంద్ర రెడ్డి, లక్ష్మి, ఎ. పి లక్ష్మి,, శివ, నహీమ్, మమత, అనిత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.