స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నసురుల్లాబాద్‌ మండలకేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఆయా గ్రూపులలో చేరేందుకు విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకట నారాయణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా సీఈసీ, హెచ్‌ఈసీ, ఏఅండ్‌టి వొకేషనల్‌ ప్రథమ సంవత్సరంలో పరిమిత సీట్లకు తక్షణ ప్రవేశాలు ఈనెల 17న నిర్వహించబడతాయని, ఇందుకు ఆసక్తిగల గిరిజన విద్యార్థులు తమ ఒరిజినల్‌ దృవపత్రాలతో కళాశాలకు హాజరు కావాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.