నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లో విషాదం

-      నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లో విషాదం చోటుచేసుకుంది. నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడు మృతితో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రదేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.కాగా అప్పట్లో హైదరాబాద్‌లోని కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి నాలాలో పడి మృతిచెందింది. మరలా ఈ ఘటన చోటుచేసుకోవడంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలను బయటకు పంపించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఎక్కడా అడుగువేస్తే గుంతలో పడతామో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాలు కురుసినప్పుడల్లా ఇలాంటి ఘటనలు జరుగుతునే వున్నాయి. ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.