కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు తృటిలో తపిన ప్రమాదం
- హెలికాప్టర్ను ఢీకొట్టిన డేగ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నాయకుడు డీకే శివకుమార్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను డేగ ఢీకొట్టింది. దాంతో హెలికాప్టర్ అద్దం ఒకవైపు పూర్తిగా పగిలిపోయింది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో పెద్దగా ఎవరికీ ఏమీ కాలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీకే శివకుమార్ ములబగిలులో ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ మధ్యాహ్నం హెలికాప్టర్లో బయలుదేరారు. ఆ హెలికాప్టర్ హోసకోట్ సమీపంలో ల్యాండ్ అవుతుండగా డేగ వచ్చి ఢీకొట్టింది. దాంతో హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది. దాంతో హెలికాప్టర్లో ఉన్న డీకే శివకుమార్కు ఏమీ కాకపోయినా, ఆయన కెమెరామెన్కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.