పంచాంగం చెబుతానని నిలువు దోపిడీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/పిట్లం: పంచాంగం చెబుతానని ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఉన్నదంతా దోచుకెళ్లిన ఘటన పిట్లం మండలం చిన్నకొడపల్లో జరిగింది. గ్రామానికి చెందిన జలంగారి మైశయ్య ఇంట్లోకి ఓ వ్యక్తి వచ్చాడు. దంపతులపై మత్తు మందు చల్లి ఇంట్లో ఉన్న 7 గ్రాముల, 15 తులాల వెండి, రూ.15 వేల నగదు అపహరించాడు. కాళ్లకున్న కడియాలు తీయరాకపోవడంతో ఆమెను ఒక చోటుకు రా అంటూ వెంట తీసుకెళ్తుండగా స్థానికులు గమనించారు. దుండగుడు వారిని చూసి పారిపోయాడు.

Leave A Reply

Your email address will not be published.