సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురికి నోమోఫోబియా  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత్‌లో సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియాతో బాధపడుతున్నారని ఒ ప్పో, కౌంటర్‌పాయింట్‌ రిసెర్చ్‌ అధ్యయనంలో వెల్లడైంది. సెల్‌ఫోన్‌ ఉండదనే ఆందోళనను నోమోఫోబియా(నో మొబైల్‌ ఫోబి యా) అంటారు. ఈ అధ్యయనం ప్రకారం సెల్‌ఫోన్‌ బ్యాటరీ 20 శాతం, అంతకంటే తక్కువ ఉంటే 72 శాతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఫోన్‌ ఆగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. 65 శాతం మంది వినియోగదారులు ఫోన్‌ బ్యాటరీ అయిపోతుంటే మానసికంగా అసౌకర్యానికి గురవుతున్నారు. నోమోఫోబియా 31 – 40 ఏండ్ల వయస్సు ఉన్న వారిలో ఎక్కువగా ఉంటున్నది. ఆ తర్వాత 25 – 30 ఏండ్ల వయస్సు వారిలో ఉంటున్నది.

Leave A Reply

Your email address will not be published.