ఈ నెల 28 న పల్నాడులో బిసి ల ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  బిసి రాజ్యాధికార సాధికారికత సాదన లక్ష్యం దిశగా ఈ నెల 28 న పల్నాడు జిల్లాలో బిసి ల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువత అద్యక్షులు గూడూరు నాని తెలిపారు.ఇట్టి కార్యక్రమానికి ఆత్మీయ అతిధులుగా జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు, రాజ్యసభ సభులు ఆర్. కృష్ణయ్య,వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజని హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.రాజ్యాధికారం ద్వారనే బిసిల అభివృద్ధి సాద్యమన్నారు.బిసిలకు రాజ్యాధికారం దక్కాలంటే బిసి జనగణన జరుపాలని, పార్లమెంట్లో బిసి బిల్లు పెట్టి ఆమోదం తెలిపి జనాబా ప్రకారం బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని, నాని డిమాండ్ చేసారు.ఉద్యోగాలలో కుడా బిసిలకు అన్యాయం జరుగుతుందని,బిసి ఉద్యోగులలకు  ప్రమోషన్లలో రిజర్వేషన్స్ అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ఈ ఆత్మీయ సమ్మేళనానికి జిల్లా వ్యాప్తంగా గల బిసి లు బిసి సంఘాల నేతలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని గూడూరు నాని పిలుపు నిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.