దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న సంక్షేమ పథకాలు  

- పలు అభివృద్ధి కార్య క్రమాలలో పాల్గొన్న మంత్రి సబితారెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని  విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాలలో మునుముందుకు పరుగులు పెడుతుందని మంత్రి సబితా రెడ్డి అన్నారు.షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు గదులు, ప్రహరీ గోడ, మౌలిక వసతుల కల్పన పనులను స్తానిక ఎమ్మెల్యే అంజ య్య యాదవ్తో కలిసి ప్రారంబించారు. వీటితో పాటు  రూ. 1.55 కోట్లు, కొందుర్గు మండలం మహాదేవపూర్ లో రూ.15 లక్షలతో బీసీ కమ్యూనిటీహాల్ నిర్మాణానికి శంకుస్థాపన , నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో 2 కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభిం చారు. అనంతరం మంత్రి సబితా మాట్లాడుతూ రాష్ట్రప్రజల క్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నసంక్షేమ పథకా లు దేశానికిఆదర్శంగా నిలుస్తు న్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయ కులకు అభివృద్ధి కనబడడం లేదని,కల్లుంది చూడలేని కాబోతుల్ల వ్యవహరిస్తున్నట్లు విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.