అమ్మవారి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జువ్వాది శ్రీదేవి దర్శించుకుని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాన్ని అందించి అర్చకులు, వేద పండితులు ఆశీర్వదించారు. హైకోర్టు న్యాయమూర్తి వెంట బైంసా ఇన్చార్జి జడ్జి జతిన్ సింగ్, ఏఎస్పీ కాంతి లాల్ పాటిల్, ఆర్డిఓ రవికుమార్, తాసిల్దార్ నారాయణ, పోలీస్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది, తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.