సీల్డ్ కవర్‌లో కర్ణాటక సీఎం పేరు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 135 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికి పైగా ఓట్ల షేర్‌ను సాధించింది కాంగ్రెస్. 1989 తరువాత ఈ స్థాయి ఓట్ షేర్‌ను కాంగ్రెస్ అందుకోవడం ఇదే తొలిసారి.

కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి ఇవ్వాళ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది. ఈ సాయంత్రం 5:30 గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఈ భేటీ ఏర్పాటయింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి ప్రధాన కారకులైన డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యల్లో ఒకరిని ముఖ్యమంత్రి పదవి వరిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సమావేశానికి పరిశీలకులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు బెంగళూరుకు రానున్నారు. పార్టీ అధిష్ఠానం అందజేసిన సీల్డ్ కవర్‌ను వారు తమవెంట తీసుకుని రానున్నారు. ఈ సాయంత్రం జరిగే సీఎల్పీ సమావేశం సందర్భంగా సీల్డ్ కవర్‌ను తెరుస్తారు. కొత్త ముఖ్యమంత్రి కోసం పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిన నాయకుడి పేరును ప్రకటిస్తారు.

Leave A Reply

Your email address will not be published.