భూ వివాదంలో తలదూర్చిన ఎస్సై పై వేటు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భూ వివాదంలో తలదూర్చిన ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో జనగామ జిల్లా రఘునాథపల్లి ఎస్సైగా పనిచేసిన ఎన్.వీరేందర్ ఓ వ్యవసాయ భూమి విషయంలో నిందితుల కు సహకరించాడని ఆరోపణలు వచ్చాయి.
దీంతో గతంలోనే ఆయనను వీఆర్కు అటాచ్ చేశారు. ఆ తర్వాత పోలీసుల ఎంక్వైరీకి వీరేం దర్ సహకరించడం లేదు. దీనికి తోడు బాధితు లను ఇబ్బందులకు గురిచేస్తూ, నిందితులకు సపోర్ట్ చేస్తున్నట్టు తేలింది. దీంతో ఎస్సై వీ రేందర్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ ఏవీ. రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.