ఎన్నికల ఆలోచనతో నేతలు సిద్ధం కావాలి

.. ముఖ్య నేతలతో చంద్రబాబు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ పాలన తీరు.. ఎన్నికలకు ఎలా సన్నధం కావాలి? ఉత్తరాంధ్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్న తంతను ప్రజలకు వివరించాలని సూచించారు. ‘‘ఎన్నికల ఆలోచనతో నేతలు సిద్ధం కావాలి. నియోజకవర్గంలో గెలుస్తామనే నమ్మకం నాకు కల్పించాలి. అందుకు అనుగుణంగానే నా నిర్ణయాలు ఉంటాయి. వైసీపీ పాలనతో నష్టపోని వర్గమంటూ లేదు. ప్రజా వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలి. మూడు రాజధానులంటూ జగన్ మోసపూరిత ప్రకటనలతో.. ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించేందుకు చూస్తున్నాడు. విశాఖను మింగేసి.. ఉత్తరాంధ్రను కబళిస్తున్న వైసీపీ మూకకు వ్యతిరేకంగా పోరాడాలి. విశాఖను కొల్లగొట్టి.. కంపెనీలను వెళ్లగొట్టిన వారు..అక్కడి ప్రజల గురించి ఇప్పుడు మాట్లాడుతారా? సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు మనం నిలబడాలి.మూడు రాజధానులు సాధ్యం కాదని కోర్టులు స్పష్టంగా చెబుతున్నా. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను జగన్ మోసం చేస్తున్నారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.