బిసి యువజన సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా సౌదాని వెంకట రమణ యాదవ్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నేషనల్ బిసి వెల్ఫేర్ అసొసియేషన్ యువజన సంఘం తెలంగాణా రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా నిర్మల్ జిల్లా చిన్న బెల్లాల్ గ్రామానికి చెందిన సౌదాని వెంకట రమణ యాదవ్ నియమితులైనారు.ఈ మేరకు బిసి భవన్ లో నేషనల్ బిసి వెల్ఫేర్ అసొసియేషన్ జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ యువతే దేశానికి పట్టుకోమ్మలని,యువత చేతిలోనే దేశ భవిషత్ ఆదార పడి ఉందన్నారు.ముక్యంగా బిసి యువత బిసిల సమస్యలపై సంఘటిత పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు.75 సంవత్సరాల స్వాతంత్ర భారతం లో బిసి ల బ్రతుకులు ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు.బిసిల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ పార్టీలు బిసిలని జండాలు మోసే కూలిలుగా చుస్తున్నాయే తప్ప బిసిలకు రాజ్యాధికారం లో వాటా ఇవ్వడం లేదన్నారు.బిసిలకు రాజ్యాధికారం దక్కాలంటే చట్ట సబల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్స్ పెట్టాలని అందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేసారు. అంతే కాకుండా బిసిల వాట బిసి లకు దక్కాలంటే బిసి జనగణన చేపట్టాలని అన్నారు.బిసి ల సమస్యల పరిష్కారం అం బిసి యువత ముందుకు వచ్చి బిసి లను చైతన్యపరచాలని కృష్ణయ్య పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో వేముల రామ కృష్ణ,మోడీ రందావ్ బాబా ,సాయిబాబా,వెంకటేశ్వరులు, సగ్గు శివ కుమార్,అయిత సాయిలు తదితరులు పాల్గొన్నారు.