పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలంగాణా కూలీలు మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం దాచేపల్లి మండలం పొందుగల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను 108లో గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దామరచర్ల మండలం నరసాపురం నుంచి గురజాల మండలం పులిపాడు కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది తెలంగాణ కూలీలు ప్రయాణిస్తున్నారు. చనిపోయిన ఐదుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.