తొమ్మిది ఏళ్ళ మోడీ అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి దిక్చూచి    

- బిజెపి జాతీయ మైనార్టీ మోర్చా అధ్యక్షులు జమాల్ సిద్ధికి

తెలంగాణ  జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీలోని కేంద్ర బిజెపి కార్యాలయంలో జరిగిన ఒక రోజు మీడియా కార్యాశాల కార్యక్రమాన్ని బిజెపి జాతీయ మైనార్టీ మోర్చా అధ్యక్షులు జమాల్ సిద్ధికి ప్రారంభించారు. ఈ ఒకరోజు శిక్షణ వర్క్ షాప్ లో తెలంగాణ రాష్ట్రం నుండి మైనార్టీ మోర్చా మీడియా కన్వీనర్ డాక్టర్ పాల్గొన్నారు  వర్క్ షాప్ నువ్వు నిర్దేశిస్తూ జమాల్సిద్ధికి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల్లో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు గతంలో 2014 ముందు ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఇప్పుడు అనేక ప్రాంతాలలో మహిళల కోసం సౌచాలయాలల నిర్మాణాన్ని చేపట్టారని ప్రాంతాలలో నీటి వసతి లేని గ్రామాలకు నేడు అన్ని గ్రామాలకు నీటి వసతిని కల్పించారని కరోనా సమయంలో రెండు కోట్ల 20 లక్షల వ్యాక్సినేషన్ పంపిణీ చేయడం జరిగిందని పీఎం ఆవాసం యోజన కింద అనేక గృహాలు నిర్మించడం జరిగిందని ఒకప్పుడు 70 మాత్రమే ఉన్న ఎయిర్పోర్టులను నేడు 140 కి పెంచారని దేశంలో అభివృద్ధి ఫలాలు అధికంగా మైనార్టీలకు అందజేయడం జరుగుతుందని వివరించారు ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో ఆల్ ఇండియా మైనార్టీ మోర్చా మీడియా ఇన్ఛార్జ్ జిలాని మరియు డాక్టర్ అస్లాం సుదం త్రివేది దేశంలోని అన్ని రాష్ట్రాల మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.