సూర్యగ్రహణం కారణంగా 25న శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఈనెల 25న సూర్యగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తామని ఆలయ ఈవో తెలిపారు. గ్రహణం కారణంగా ఆర్జిత సేవలు, శాశ్వత సేవలు, పరోక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ రద్దు చేస్తున్నట్లు వివరించారు. రాత్రి 8 గంటల తరువాత మల్లన్న సర్వదర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.