క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడి యువకుని ఆత్మహత్య

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ గేమ్స్ నడుస్తుండడంతో గ్రామాలలో యువకులు విచ్చలవిడిగా ఆన్లైన్‌లో బెట్టింగ్ లకు పాల్పడి తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఫరూఖ్ నగర్ మండలం గిరాయి గుట్ట గ్రామపంచాయతీ పరిధిలో ప్రకాష్(19) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏది ఏమైనా క్రికెట్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.