బీసీల మద్దతుతో తెలంగాణలో అధికారంలోకి బీజేపీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ఓబీసీ సమ్మేళనం గురువారం ప్రారంభమైంది. నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ బూర నర్సయ్య గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్, ఆలే భాస్కర్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ ఓబీసీ సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో ఓబీసీలు, బీజేపీ క్యాడర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తపేట నుండి నాగోల్ వరకు బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఓబీసీ సమ్మేళనం చేపట్టారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ… మోదీ నాయకత్వంలోని బీజేపీతోనే బీసీలకు న్యాయం‌ జరుతోందన్నారు. బీసీల మద్దతుతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. బీసీలకు పెద్ద పీఠ వేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దే అని చొప్పుకొచ్చారు. బీసీల రిజర్వేషన్లను కుదించిన చరిత్ర సీఎం కేసీఆర్ ది అని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల ద్రోహి అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ సోదరులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. బీసీల సీట్లను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో‌ కేసీఆర్ ముస్లింలకు అవకాశం ఇచ్చారన్నారు. బీసీలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలదని దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ జనగణన ఎందకు చేయలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు.

 

Leave A Reply

Your email address will not be published.