భానుడి భగభగలకు జనాలు ఉక్కిరి బిక్కిరి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భానుడి భగభగలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 తర్వాత బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 45.9 డిగ్రీలు నమోదు కాగా, కరీంనగర్ జిల్లా తంగలలో 45.6 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 45.4 డిగ్రీలు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 45.1 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 44.5 డిగ్రీలు, వనపర్తి జిల్లా కానాయపల్లిలో 44.4 డిగ్రీలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌతాలలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.