తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన మహానేత ఎన్టీఆర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలుగు జాతికి గుర్తింపు తీసుకొచ్చిన మహా నేత నటరత్న నందమూరి తారక రామారావు అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జ్ కర్రీ వేణుమాధవ్ కొనియాడారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నటరత్న నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ ఏపీ భవన్ మీడియా సెంటర్లో ఘనంగా నిర్వహించారు.అన్న నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలవేసి తెలుగువారి సమక్షంలో ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈ సందర్బంగా తమ సంగం ఆద్వర్యం లో శతజయంతి ఉత్సవాలు చేస్తున్నట్టుగా కర్రి వేణుమాధవ్ తెలియజేశారు ఈ సందర్భంగా ఢిల్లీలో ఉన్న వివిధ సంఘాల వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

Leave A Reply

Your email address will not be published.