డిగ్రీ పట్టా అందుకున్న శునకం..
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: డిగ్రీ పట్టా అందుకున్న ఓ శునకం అందరి మనసుల్ని దోచింది. న్యూజెర్సీలోని సెటాన్ హాల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సెర్మనీలో విద్యార్థినితో పాటు ఆ శునకం కూడా పట్టాను అందుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. సెటాన్ వర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చదివిన మారియానీ అనే అమ్మాయి డిగ్రీ పట్టా అందుకోవాల్సి ఉంది. అయితే చాన్నాళ్ల నుంచి వీల్చైర్పై ఉన్న ఆమెకు జస్టిన్ అనే శునకం కూడా తోడుగా ఉంటోంది. తాజాగా ఆ వర్సిటీ గ్రాడ్యుయేషన్ సెర్మనీ నిర్వహించింది. ఆ వేడుకకు వీల్చైర్లో వచ్చిన ఆమె తనతో పాటు కుక్కను కూడా తీసుకువచ్చింది. ఆ సమయంలో వర్సిటీ ఇంచార్జి.. ఆ శునకానికి డిగ్రీ పట్టాను అందజేశారు. ఆ గౌరవ పట్టాను శునకం తన నోటితో అందుకున్నది. ఆ సమయంలో విద్యార్థులు కేరింతలు చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియోను ఆ వర్సిటీ తన ట్విట్టర్లో పోస్టు చేసింది.