మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు గెలువబోతున్నాం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉన్నది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ శివరాజ్సింగ్ చౌహాన్ సారథ్యంలోని బీజేపీ సర్కారుకు కర్రుకాల్చి వాత పెట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. మధ్యప్రదేశ్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు.ఇవాళ మధ్యప్రదేశ్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన రాహుల్గాంధీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకుగాను తమ పార్టీ 136 స్థానాలు గెలిచిందని, ఇప్పుడు ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృతమవుతాయని రాహుల్ ధీమా వ్యక్తంచేశారు. మధ్యప్రదేశ్లో మొత్తం 230 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు.