పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ పథకం దేశమంతటా అమలు

-  జాతీయ బిసి కమిషన్ చైర్మన్ తో జాతీయ బిసి సంక్షేమ సంఘం నేతల చర్చలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని,  కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారాం ను ఢిల్లీలో లో కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చలలో ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, కర్రి వేణుమాధవ్, డాక్టర్ పద్మలత, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య, మాట్లాడుతూ           స్వాతంత్ర వచ్చి 75 సంవత్సరాలు గడిచిన 56% జనాభా గల బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం ఈ కులాల అభివృద్ధి జరగడం లేదు అని సామాజిక వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లు యున్నవి. కానీ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం వలన అన్యాయం కాదాయని జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం  దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు 2 వేల కోట్లు కేటాయించి 56 శాతం జనాభా ను అవమానించారని అన్నారు. కేంద్ర బడ్జెట్ 45 లక్షల 50 వేల కోట్లు ఉంటే 56 శాతం జనాభా గల బీసీలకు  కేవలం 2 వేల కోట్లు కేటాయించారు. ఇది ఏ మూలకు సరిపోతుంది ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ బిసి అభివృద్ధికి 40 సిఫార్సులు  చేస్తే అందులో ఆర్థికాభివృద్ధికి 16 సిఫార్సులు చేశారు. కానీ ఇంతవరకు ఒక్క సిఫార్సు కూడా అమలు చేయలేదు.  కేంద్ర ప్రభుత్వం బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో 27 శాతం రిజర్వేషన్లు పెట్టారు వీటికి అనుబంధంగా ఆర్థికపరమైన రాయితీలు స్కాలర్ షిప్ లు,  ఫీజు మంజూరు, హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, మంజూరుకు బడ్జెట్ కేటాయించడం లేదు. ప్రత్యేక హాస్టళ్ళు – విద్యా సంస్థలు లేకపోతే బి.సి లు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు.      ఐ.ఐ.టి – ఐ.ఐ.యం – నీట్ లాంటి ముఖ్యమైన కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు ఈ కోర్సుల ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నవి. ఒక లక్షా 30 వేల నుండి ఒక లక్షా 70  వేల వరకు ఫీజులు ఉన్నవి. పైగా బీసీలకు క్రిమిలేయర్ ఆర్థిక పరిమితి విధించారు అత్యంత వెనకబడిన కులాల వారు సీట్లు పొందినప్పటికీ ఫీజు కట్టే సోమత లేక చదువు మానుకుంటున్నారని చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.పరిశ్రమలు రావడం, యాంత్రీకరణ చెందడం మూలంగా కులవృత్తులు – చేతివృత్తులు దెబ్బతిన్నాయి. దీనితో ఈ కుల వృత్తుల వారు వృత్తులు కోల్పోయి ఆకలి చావులకు గురవుతున్నారు. వీరికి ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుండి 50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే రాజీవ్ ఫెలో షిప్  పథకం కింద అర్హులైన Ph.D స్కాలర్స్ అందరికీ స్టై ఫండు మంజూరు చేయాలని, గురుకులపాఠశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు బడ్జెట్ కేటాయించాలని కోరారు. పారిశ్రామిక పాలసీలలో, కాంట్రాక్టుల కేటాయింపులో బీసీలకు 50 శాతం కోటా ఇవ్వాలని కోరారు.        ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేసే బీసీ పథకాలకు 60 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కోరారు.బీసీల డిమాండ్లు న్యాయమైనవని ఈ డిమాండ్లు పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చైర్మన్ హంసరాజ్ గంగారాం హామీ ఇచ్చారు .

Leave A Reply

Your email address will not be published.