జూన్ 4 కు విమానాల రద్దు పొడిగింపు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కార్యాచరణ కారణాల కారణంగా తన విమానాల రద్దును జూన్ 4, 2023 వరకు పొడిగించినట్లు గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఇంతకుమునుపు ఈ రద్దును మే 30 వరకు పేర్కొన్న గో ఫస్ట్.. తాజాగా జూన్ 4 వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు దానిని మరో ఐదు రోజులు పెంచుతున్నట్టు నిర్ణయాన్ని వెలువరించింది.

ఈ సందర్భంగా ట్వీట్ చేసిన గో ఫస్ట్.. వినియోగదారుల అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. మరింత సమాచారం కోసం http://shorturl.at/jlrEZని సందర్శించవలసిందిగా కస్టమర్‌లను అభ్యర్థిస్తున్నామని చెప్పింది. ఏవైనా ప్రశ్నలు లేదా వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండంటూ ట్వీట్ లో తెలిపింది. త్వరలో అసలు చెల్లింపు మోడ్ ను పూర్తిగా వాపసు చేయబడుతుందని పేర్కొంది. విమానయాన సంస్థ ఇప్పటికే టిక్కెట్ల జారీని నిలిపివేసింది. మే 3 నుంచి తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసింది.

Leave A Reply

Your email address will not be published.