పెళ్లయిన నెల రోజులకే నవవధువు ఆత్మహత్య

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: కట్టుకున్న వాడితో వందేళ్ళ జీవితాన్ని ఊహించుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన నవవధువు పెళ్లయిన నెల రోజులకే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని  కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసకుంది. వివరాల్లోకి వెళితే.. వసంత్‌నగర్‌లో నివసించే నరేష్‌ గౌడ్‌కు గాజుల రామారం ప్రాంతానికి చెందిన నందిని (23)కి నెల రోజుల క్రితం వివాహమైంది. ఇరు కుంటాబల పెద్దలు వైభవంగా వీరి పెళ్లి నిర్వహించారు. పెళ్లి అనంతరం జరగాల్సిన కార్యక్రమాలు పూర్తయ్యాక.. నందినిని అత్తవారింటికి పంపించారు. అయితే ఆమె శనివారం ( జూన్ 3) రాత్రి 7 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తపుపులేసుకున్న నందిని సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.ఎంతసేపటికి గదిలోనుంచి నందిని బయటకు రాకపోవటంతో నందిని అత్త, భర్త తలుపుతట్టి చూశారు. ఎంత పిలిచినా గది నుంచి ఉలుకుపలుకు లేకపోవటంతో అనుమానం వచ్చి గది తలపులు బద్దలుకొట్టిచూశారు. ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడటం చూసి షాక్‌కు గురయ్యారు. నందిని కిందకు దించి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది. వెంటనే ఈ విషయాన్ని నందిని తల్లిదండ్రులతో పాటు పోలీసులు చెప్పారు.ఎందుకురా రాజు.. నేనేం పాపం చేసిన.. ఎందుకిలా చేశావ్..!ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నందిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అసలు నందిని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ? అత్తింటి వారు ఏమైనా వేధింపులకు గురి చేశారా? లేక వ్యక్తిగత కారణాలు, అనారోగ్య సమస్యలతో చనిపోయిందా? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు

Leave A Reply

Your email address will not be published.