ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ASR ఫౌండేషన్ పాత కమిటీ గడువు ముగిసినందున ASR ఫౌండేషన్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీని ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అయ్యల సంతోష్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడు-గోస్కె సాయి ప్రసాద్,
ప్రధాన కార్యదర్శి-సయ్యద్ మంజూర్, ఉపాధ్యక్షులు-సంగు బాలకృష్ణ,కుమ్మరి సాయి కుమార్, కోశాధికారి-బస్వంత్, జాయింట్ సెక్రెటరీ-సంగ్రామ్ సింగ్,హశo సయ్యద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ-జీవన్, సలహాదారులు- సయ్యద్ మెహ్రాజ్,రెడ్డి పర్వన్న, సభ్యులు-దౌతే జైపాల్,మేత్రి సాయిలును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ASR ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అయ్యాల సంతోష్ మాట్లాడుతూ ఫౌండేషన్ అక్షరం ,ఆరోగ్యం ,అభివృద్ధి అంశాల మీద పనిచేస్తుందని అదేవిధంగా ఈ ఫౌండేషన్ ని ప్రతి మండలంలో ఉన్న ఫౌండేషన్ సభ్యులు ప్రతి గ్రామంలోకి తీసుకు వెళ్లే విధంగా ఫౌండేషన్ సభ్యులు కృషి చేయాలని, సామాజికంగా సేవ చేయడానికి ఫౌండేషన్ సభ్యులు ఎల్లప్పుడూ ముందుండాలని సూచించడమే కాకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులను ఆయన అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.