ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న భాస్కర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం లోని చౌటుప్పల్ చిన్న కొండూరు గూడెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి ఓటర్లకు వివరిస్తూ తెరాస బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ముందుకు సాగుతున్నారు. గురువారం మునుగోడు తెరాస పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి చౌటుప్పల్ రూరల్ మండలం చిన్న కొండూరు, మందోళ గూడెం గ్రామాల నుండి 300 కు పైగ ద్విచక్ర వాహన ర్యాలీ కి,నాయకులకు,కార్యకర్తలకు జెండా ఊపి ర్యాలీ భాస్కర్ రెడ్డి ప్రారంభించారు ఈ ఎన్నికల ప్రచారంలో ఆయనతోపాటు బాన్సువాడ నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.