ఘోర ప్రమాదం… నలుగురు చిన్నారుల మృతి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జిల్లాలో బూర్గంపాడ్లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జిపై నుంచి టాటాఏస్ వాహనం కిన్నెరసాని వాగులో పడిన ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో టాటాఏస్లో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బాధితులు టి.నర్సాపురంలోని తిరుమలదేవిపేట వాసులుగా గుర్తించారు. భద్రాచలం దర్శనానికి వెళ్లివస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు అడిగితెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.