పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకే వార్డు ఆఫీస్‌ వ్యవస్ధ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి వేడుకల్లో భాగంగా ఈరోజు అమీర్‌పేటలోని 98వ వార్డు కార్యాలయంలో పట్టణ ప్రగతి కార్యక్రమం లో బాగంగా పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పారిశుధ్య కార్మికుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వార్డు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం వార్డు ఆఫీస్‌ వ్యవస్ధకు శ్రీకారం చుట్టిందన్నారు. దేశంలోనే తొలిసారిగా విద్యుత్, నీటి సరఫరా, ఎంటమాలజీ, కమ్యూనిటీ వార్డు ఆర్గనైజర్‌తో సహా పదకొండు పట్టణ సేవలను అధికారులు వార్డు కార్యాలయం నుంచి అందించనున్నారు. దీంతో ప్రజలు ప్రధాన కార్యాలయానికి, జోనల్ కార్యాలయాలకు వెళ్లకుండానే తమ ప్రాథమిక సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థలతోపాటు జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఈరోజు పట్టణ ప్రగతిని జరుపుకుంటున్నట్లు తెలిపారు. పట్టణాభివృద్ధిలో గత తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై ఈ రోజు చర్చిస్తారు. వేగవంతమైన పట్టణీకరణ  కారణంగా పట్టణ ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల అవసరం ఎంతైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, పట్టణ పచ్చదనాన్ని పెంపొందించడం, సురక్షితమైన తాగునీటిని అందించడం వంటి వాటి ద్వారా ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. వికేంద్రీకృత పరిపాలన ఆవశ్యకతపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది, ఫలితంగా వార్డు కార్యాలయ వ్యవస్థను తీసుకోని దీని ద్వారా అన్ని ప్రాథమిక పట్టణ సేవలు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఈ కార్యాలయం నుండి అందిస్తారు.వార్డులోని సీనియర్‌ సిటిజన్‌లు స్వచ్ఛందంగా వివిధ సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నందుకు వారిని అభినందించిన ప్రధాన కార్యదర్శి, వృద్ధులను చూసి యువత స్ఫూర్తి పొంది సమాజాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఆమె కోరారు.అనంతరం పారిశుధ్య కార్మికులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్కరించి సర్టిఫికెట్లు అందజేశారు. జోనల్ కమిషనర్ రవికిరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.