ప్రజలకు అందుబాటులో ఉండాలి

తెలంగాణ జ్యోతి, బీర్కూర్.
గ్రామాలలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఎంపీపీ రఘు తెలిపారు. గురువారం రోజు ఎంపీపీ రఘు అధ్యక్షతన ఎంపీడీఓ కార్యాలయం సమావేశపు భవనంలో బీర్కూర్ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలస్థాయి అధికారులు తమ శాఖలకు సంబందించిన ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కరిస్తామని సమాధానం ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎంపీపీ రఘు సుచుంచారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ భానుప్రకాష్, తహసీల్దార్ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, కో ఆప్షన్ ఆరీఫ్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.